Sunday, May 16, 2021
Saturday, August 19, 2017
"సామవేదం" చేతుల మీదుగా 23 న సుందరకాండ ఆవిష్కరణ
రాజమహేంద్రవరం (ఇరా న్యూస్) : సీనియర్ జర్నలిస్ట్ దీక్షితుల సుబ్రహ్మణ్యం సులభ శైలిలో అందించిన శ్రీమద్రామాయణ సారం సీతారామ కథాసుధ ఐదవ భాగం సుందర కాండ ఆవిష్కరణ సభ ఈనెల 23 వ తేదీ, బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాలులో జరుగుతుందని ఆర్ ఆర్ పబ్లిషర్స్ నిర్వాహకుడు జె రమేష్ రాజా తెలిపారు. సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ విశిష్ట అతిథిగా హాజరై గ్రంథావిష్కరణ చేసి అనుగ్రహ భాషణం గావిస్తారు. దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. సభకు రోటేరియన్ పట్టపగలు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు. డాక్టర్ శ్రీ టివి నారాయణరావు గ్రంథ సమీక్ష గావిస్తారు. దుబాయ్ తెలుగు సంఘం ఉపాధ్యక్షులు శ్రీ జాఫర్ ఆలీ, ఆదిత్య విద్య సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, శ్రీ షిర్డీ సాయి విద్యానికేతన్ డైరెక్టర్ శ్రీ తంబాబత్తుల శ్రీధర్, ట్రిప్స్ విద్యాసంస్థ డైరెక్టర్ శ్రీమతి బాలా త్రిపుర సుందరి, నలంద విద్యాసంస్థ డైరెక్టర్ శ్రీమతి డి. నిర్మల, రిటైర్డ్ న్యాయాధికారి శ్రీ వెంపటి విశ్వనాథం, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి గొల్లపూడి శ్యాం ప్రసాద్ ముఖర్జీ, గంగరాజు డైరీ అధినేత నిమ్మలపూడి గోవింద్, సాయి విద్యాసంస్థల డైరెక్టర్ డివి సుబ్బారావు, గౌతమి కో ఆపరేటివ్ సూపర్ బజార్ చైర్మన్ ప్రసాదుల హరినాథ్ అతిథులుగా హాజరవుతారు. మొదటి ప్రతిని ఠాగూర్ పత్రిక ఎడిటర్ కొత్త నాగేశ్వరరావు కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కుడుపూడి పార్థసారథి వందన సమర్పణ చేస్తారు.
Wednesday, August 16, 2017
Tuesday, August 15, 2017
Saturday, August 12, 2017
Friday, August 11, 2017
Subscribe to:
Posts (Atom)

